విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ural

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువకులు బుచ్చయ్యపేట మండలం శివరాంపురానికి చెందిన వారిగా గుర్తించారు. కూలీ పని కోసం నర్సింగరావు పేటకు వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story