వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు

X
By - TV5 Telugu |27 Dec 2019 4:20 PM IST
అనంతపురం జిల్లాలో వైసీపి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే కారణంగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. కంబదూరు మండలం, ములకనూరు గ్రామంలో.. తన భార్యపై దురుసుగా ప్రవర్తించారనే కారణంగా మైలాప్ప అనే అతను.. గంపల ప్రకాష్, నరేష్, వివప్ప అనే వైసీపీ నాయకులపై ఇనుప రాడ్తో దాడికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఈ దాడిలో గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com