అమెరికా వెళ్లాలంటూ డాలర్ల ఎక్సేంజి ముసుగులో మోసాలు
By - TV5 Telugu |27 Dec 2019 1:16 PM GMT
అద్దె ఇంటిని సొంతిల్లుగా చెబుతూ కలరింగ్ ఇస్తాడు. జస్ట్ డయల్ ద్వారా మనీ ఎక్సేంజి ఆఫీస్కు ఫోన్ చేస్తాడు. తానో వ్యాపారినంటూ పరిచయం చేసుకుని.. అమెరికా వెళ్లాలి... 7 వేల అమెరికన్ డాలర్ల ఎక్సేంజి కోసం ఇంటికి రమ్మంటాడు. ఇంటికి రాగానే ఆ డబ్బుతో ఉడాయిస్తాడు. అతడే రాహుల్ కిరణ్ అలియాస్ నిఖిల్. ముంబయికి చెందిన రాహుల్.. ఇలా కొన్నేళ్లుగా మోసాలు చేస్తూ బతికేస్తున్నాడు. బంజారాహిల్స్ పరిధిలో అతడిపై 2 కేసులు నమోదు కావడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పూణేలోనూ ఇలాంటి కేసులు నమోదైనట్టు గుర్తించారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com