దేవికారాణిపై ఈడీ కేసు నమోదు
By - TV5 Telugu |28 Dec 2019 5:50 AM GMT
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ గురిపెట్టింది. మనీలాండరింగ్కు పాల్పడినట్లు దేవికారాణిపై అభియోగాలు రావడంతో.. ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశాల్లో దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఈడీ.. ఏసీబీ వద్ద ఉన్న ఆస్తుల చిట్టా ఆధారంగా కేసు నమోదు చేసింది. ఇప్పటికే దేవికారాణిపై 3 కేసులు నమోదు చేసింది ఏసీబీ. ఈఎస్ఐలో 200 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఈడీ, ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com