పౌరసత్వ సవరణ భారతీయులకు సంబంధించిందే కాదు : ఎంపీ జీవిఎల్

X
By - TV5 Telugu |29 Dec 2019 4:37 PM IST
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తోంది బీజేపీ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పాల్గొన్నారు. ద్వేష పూరిత భావనతో ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు మైనారిటీల్లో భయాందోళన కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని జీవీఎల్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ భారతీయులకు సంబంధించిన అంశమే కాదని అన్నారాయన.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com