ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ

ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ

road-accident

ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం విద్యార్థిని బలితీసుకుంది. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడవ తరగతి చదువుతున్న అవంతి కుమార్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బీభత్స దృశ్యాలు భయపెడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక విద్యార్థి మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

అత్యంత వేగంగా లారీ దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని మొయినుద్దీన్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తరువాత విద్యార్థి మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story