కెనడాలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి

కెనడాలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి

canada

కెనడాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మనిటోబా ప్రావిన్స్‌లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 13 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో 8 మంది ప్రయాణికులు కాగా, మిగతా వారు రైల్వే సిబ్బంది. ప్రమాదం జరిగిన పోర్టిగాలా ప్రైరీ వద్దకు చేరుకున్న సహాయ బృందాలు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాయి. అలాగే భారీ క్రేన్ల సాయంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. కెనడా రవాణా భద్రత బోర్డు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అటు, గాయపడ్డవారి క్షేమ సమాచారాలు బంధువులకు తెలియ చేసేందుకు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story