ఘనంగా ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఘనంగా జరిగింది. టీవీ 5 రిపోర్టర్ ప్రముఖ కవి ప్రసేన్కు ఈ ఏడాది విశిష్ట సాహిత్య పురస్కారం అందించారు. సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్కు విశిష్ట పాత్రికేయ అవార్డు అందించారు. అరుణ్సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా... ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు.. సీనియర్ జర్నలిస్టులు, విఖ్యాత రచయితలు.. అరుణ్ సాగర్ అభిమానులు హాజరయ్యారు.
అరుణ్ సాగర్ మామూలు వ్యక్తి కాదని.. ఓ మహా మేధావి అని టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు కొనియాడారు. ఆయనతో కొద్ది కాలం పాటు మాత్రమే పనిచేసినా.. అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అరుణ్సాగర్ మీద ఉన్న గౌరవంతోనే తాను ఈ సభకు హాజరైనట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com