సేవ్ అమరావతి పేరుతో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థులు రోడ్డెక్కారు. SFI ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం నష్టపోతుందని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు.