లిబియాలో ఘోరం : 28 మంది సైనికుల మృతి
By - TV5 Telugu |5 Jan 2020 9:22 AM GMT
లిబియా రాజధాని ట్రిపోలీ వైమానిక దాడితో దద్దరిల్లింది. సైనిక స్కూల్ పై జరిగిన దాడిలో దాదాపు 28 మంది సైనికులు మరణించారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ దాడి సమయంలో సైనికులంతా పెరేడ్ లో పాల్గొని.. గుడారాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అటాక్ జరిగినట్లు ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2011లో నాటో సైనిక సహయంతో నియంత మోమెర్ గడాఫీని జిఎన్ ఏ దళాలు మట్టుపెట్టాయి. దీంతో లిబియాలో గందరగోళం నెలకొంది. అప్పటినుంచి జీఎన్ ఏ దళాలకు, దాని ప్రత్యర్ధి సైన్యానికి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com