లిబియాలో ఘోరం : 28 మంది సైనికుల మృతి

లిబియాలో ఘోరం : 28 మంది సైనికుల మృతి

libhiya

లిబియా రాజధాని ట్రిపోలీ వైమానిక దాడితో దద్దరిల్లింది. సైనిక స్కూల్ పై జరిగిన దాడిలో దాదాపు 28 మంది సైనికులు మరణించారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ దాడి సమయంలో సైనికులంతా పెరేడ్ లో పాల్గొని.. గుడారాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అటాక్ జరిగినట్లు ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2011లో నాటో సైనిక సహయంతో నియంత మోమెర్ గడాఫీని జిఎన్ ఏ దళాలు మట్టుపెట్టాయి. దీంతో లిబియాలో గందరగోళం నెలకొంది. అప్పటినుంచి జీఎన్ ఏ దళాలకు, దాని ప్రత్యర్ధి సైన్యానికి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story