అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ర్యాలీ

అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ర్యాలీ

amaravati

సేవ్ అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ర్యాలీ జరిగింది. క్వారీ సెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని సహా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ రాజమహేంద్రవరంలో జేఏసీ డిమాండ్ చేసింది. ఇవాళ నిర్వహించిన కార్యక్రమాలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. క్వారీ సెంటర్‌లో భారీ మానవహారం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేతలు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story