బీజేపీలో చేరుతా.. కానీ.. అంటున్న జేసీ

X
By - TV5 Telugu |6 Jan 2020 3:51 PM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానం హెలిప్యాడ్లో కిషన్ రెడ్డితో జేసీ భేటీ అయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయకార్యదర్శి సత్య కుమార్తో జేసీ కలవడం.. ఆతర్వాతి రోజే కిషన్ రెడ్డిని భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి.. బీజేపీ చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాని.. జేసీ మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను బీజేపీ స్వాధీనం చేసుకున్న అనంతరమే చేరుతానని స్పష్టం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com