రాజధాని మార్పుతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారుతుంది: నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ

రాజధాని మార్పుతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారుతుంది: నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ

mohan

రాజధాని అమరావతి మార్పుపై రాష్ట్రం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లు తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు ప్రముఖ ఎన్నారై, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ. అమెరికాలోని న్యూజెర్సీలో రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని మార్పుతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారుతుందని, దీనివల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆగిపోతాయని మోహన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్నిసంఘాలతో కలిసి ఎన్నారై జాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story