దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా 'ప్రవాసీ భారతీయ దివస్'వేడుకలు
By - TV5 Telugu |10 Jan 2020 8:29 AM GMT
దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి పవన్ కపూర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 2019 ప్రవాసీ భారతీయ అవార్డు గ్రహీతలు సురేందర్ కాంధారి(గురుద్వారా-చైర్మన్), జులేక దావుద్(జులేక హెల్త్ కేర్ గ్రూప్
(ఫౌండర్ మరియు చైర్మన్), వాసు షరాఫ్(ప్రముఖ పారిశ్రామివేత్త), గిరీష్ పంత్(సోషల్ వర్కర్)లకు పవన్ కపూర్ మెమెంటో అందజేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com