ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఉద్యమం.. రైతు ఆత్మహత్యాయత్నం
By - TV5 Telugu |11 Jan 2020 1:14 PM GMT
పోలీసుల దమనకాండను లెక్కచేయకుండా రాజధాని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. తుళ్లూరు దీక్షాశిబిరం వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శిబిరం నుంచి పక్కకు వచ్చిన షేక్జానీ అనే రైతు కిరోసిన్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న గ్రామస్థులు, పోలీసులు గమనించి వెంటనే అడ్డుకున్నారు. దుస్తులు విప్పేసి నీళ్లు పోశారు. చికిత్స తీసుకునేందుకు ఆ రైతు నిరాకరించాడు. పోలీసులు తీసుకెళ్తుంటే తీవ్రంగా ప్రతిఘటించాడు. చివరికి అతడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com