ఒమన్ రూలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన హైతం బిన్ తారిఖ్ అల్ సైద్

ఒమన్ రూలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన హైతం బిన్ తారిఖ్ అల్ సైద్

haitham-bin

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు తెలిపింది. సుల్తాన్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు ఓ ప్రటకన విడుదల చేసింది. అరబ్, ఇస్లామిక్ దేశాల అభిమానం పొందిన సుల్తాన్ మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందని విచారణ వ్యక్తం చేసింది.అనారోగ్యంతో కన్నుమూసిన సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్థానం లో ఒమన్ రూలర్ గా హైతం బిన్ తారిఖ్ అల్ సైద్ ప్రమాణ స్వీకారం చేశారు. సుల్తాన్ తన తరువాతి వారసుడి పేరును ఓ సీల్డ్ కవర్‌లో దాచిపెట్టారు. తాను చనిపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ విధించారు. దీంతో రూలర్ సుల్తాన్ కబూస్ స్థానంలో అతని వారసుడిగా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. సుల్తాన్ కబూస్ బిన్ ఎంపిక కావడం పట్ల ఒమన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read MoreRead Less
Next Story