తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

accident

పండగ వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావులపాలెం 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

రావులపాలెం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు.. తణుకు నుండి వస్తున్న మరొక కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story