సరిలేరు నాకెవ్వరు.. కోట్లలో రెమ్యునరేషన్
By - TV5 Telugu |17 Jan 2020 9:10 AM GMT
సెకండ్ ఇన్నింగ్స్ అని అంత తేలిగ్గా తీసేయడానికి లేదు. పేరులోనే విజయం వుంది.. అందుకే దాదాపు 13 ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూలో నటించినా తన పాత్రలో పవర్ తగ్గలేదని నిరూపించింది. చిత్ర ఘన విజయానికి తోడ్పడింది విజయశాంతి. ప్రొఫెసర్ భారతిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె 1.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. హీరోయిన్గా నటించిన రష్మిక మందన రెమ్యునరేషన్ కంటే విజయశాంతికే ఎక్కువ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com