ఇంటిపై తిష్ట వేసిన చిరుత.. ఇంటి బయటకు అడుగుపెట్టని స్థానికులు

X
By - TV5 Telugu |20 Jan 2020 10:13 PM IST
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ చిరుత కలకలం సృష్టించింది. పటేల్ రోడ్డులో మన్నే విజయ్కుమార్ ఇంటిపై చిరుత తిష్టవేయడంతో స్థానికులు భయభ్రాంతకులకు గురయ్యారు. దీంతో అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న జూ రెస్క్యూ ఆపరేషన్ టీం చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల వారికి నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. చిరుత సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com