టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్

టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్

speaker

రాజధాని భూములపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రజలు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మధ్యలో టీడీపీ సభ్యులు అడ్డుతగలడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపించాలనే అధికారం నాకు లేదా అంటూ ఫైర్ అయ్యారు. నన్ను డిక్టేట్ చేస్తారా అని ప్రశ్నించారు. స్పీకర్ వినతిపై స్పందించిన సీఎం జగన్.. మీరు న్యాయమూర్తిలాంటి వారు.. మీ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అయితే మీకేం అధికారం ఉందంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స.. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story