రైతుబంధు నిధులు మంజూరు చేసిన కేసీఆర్ సర్కార్

రైతుబంధు నిధులు మంజూరు చేసిన కేసీఆర్ సర్కార్

raitu

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందించింది. రైతు బంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. 5వేల 100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12వేల 862 కోట్లు కేటాయించగా ఖరీఫ్‌లో 6వేల 862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. తాజాగా రబీలో అందించేందుకు 5వేల 100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ పరిపాలనాశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థికశాఖ ఆ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story