పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం - సీఎం జగన్
By - TV5 Telugu |21 Jan 2020 8:57 PM GMT
పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 82 లక్షల మంది భవిష్యత్తును మార్చే పథకమని అన్నారాయన. మధ్యాహ్న భోజనంలోను మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ఆ పథకం పనితీరు పర్యవేక్షణకు నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జూన్ 1న ప్రతి విద్యార్థికి కిట్ అందజేస్తామని.. ఆ పథకం పేరు విద్యా కానుకగా జగన్ చెప్పారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com