అర్థరాత్రి 12 దాటినా హ్యాపీగా షాపింగ్.. 24 అవర్స్ ఓపెన్ మరి..

X
By - TV5 Telugu |22 Jan 2020 11:35 PM IST
వర్షం పడుతుంటే ఐస్క్రీం.. నగర మంతా నిద్రపోతుంటే హ్యాపీగా షాపింగ్ చేస్తుంటే ఎంత బావుంటుంది. మరి ఇప్పటి యూత్కి ఇదే కావాలి. అందుకే మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే పర్మిషన్ ఇచ్చేశారు. ముంబైలోని కొన్ని ప్రాంతాలు బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్ లాంటి ఏరియాల్లో అర్థరాత్రి వరకే కాదు తెల్లవార్లు షాపులు తెరుచుకునే ఉండొచ్చని ప్రకటించారు. ఇక్కడ మాల్స్, షాపులు, భోజనశాలలు 24 గంటలు తెరిచే ఉంటాయని మంత్రి తెలిపారు. ఈనెల 27 నుంచే ఇది అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com