అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై కేసు నమోదు

X
By - TV5 Telugu |23 Jan 2020 3:59 PM IST
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు బెల్లంకొండ నరసింహపై కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేశారని.. 99 సెంట్లు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందని సీఐడీ ఎస్పీ తెలిపారు. ఇక భూముల కొనుగోలు వ్యవహారంలో సీఐడీ జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com