జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లిలా మారాడు : దేవినేని ఉమా
By - TV5 Telugu |23 Jan 2020 1:49 PM GMT
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలోని గొల్లపూడిలో తెలుగుదేశం వినూత్న నిరసన చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 4 వేల నల్ల బెలూన్లను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఎగురవేశారు. అసెంబ్లీలో మంత్రులు మాట్లాడే భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని... 24 మంది రైతులు చనిపోతే ముఖ్యమంత్రి వారి కుటుంబాలను పరామర్శించక పోవడం దారుణమని దేవినేని ఉమా మండిపడ్డారు. జగన్ పులివెందుల పులి కాదు.. పులివెందుల పిల్లిలా మారారు అని దేవినేని ఉమా విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com