వాళ్లిద్దర్నీ చూసాక పెళ్లిపై మనసు.. : హీరోయిన్

వాళ్లిద్దర్నీ చూసాక పెళ్లిపై మనసు.. : హీరోయిన్

పెళ్లంటే రాజీ పడడం. ఇష్టం ఉన్నా లేకపోయినా సర్ధుకుపోవాలి. ఆమెది పై చేయిగా ఉండడానికి అతడు ఇష్టపడడు. ఎన్నో వైరుద్యాలు.. ఇన్ని ఆలోచనల మధ్య పెళ్లి చేసుకోవడం అవసరమా అని చాలా సార్లు అనుకునేదాన్ని. అయినా నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి దొరుకుతాడా అని పెళ్లిపై విముఖత పెంచుకున్నాను. అయితే పంగా దర్శకురాలు అశ్వినీ అయ్యర్, ఆమె భర్త నితేష్ తివారీని చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను అని అంటోంది బాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్ కంగనా రనౌత్.

ఏ విషయం అయినా ముఖం మీదే చెప్పేస్తుంది. ఎవరేమనుకున్నా నాకేంటి అని ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. అదే ఒక్కోసారి తనను ఇబ్బందికి గురిచేసినా తన అభిప్రాయాన్ని మార్చుకోనంటుంది కంగన. ఎంతో అన్యోన్యంగా ఉండే అశ్వినీని ఆమె భర్తని చూసాక పెళ్లి చేసుకోవాలనిపించింది. నచ్చిన వ్యక్తి నా అభిప్రాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని అంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరెందుకని అంటే.. దాని కోసం చాలా సమయం వేస్ట్ చేసుకోవటం నాకిష్టం లేదు. ఇప్పటికే నటిగా నా ప్రపంచంలో నిలదొక్కుకోవటానికి చాలా తంటాలు పడుతున్నా.. ఈ సమయంలో సోషల్ మీడియా అనే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టడం నా వల్ల కాదు. రెండింటినీ నేను మేనేజ్ చేయలేను. ఈ విషయంలో ఎవరేమి అనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story