భైంసాలో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడుతున్న బీజేపీ-ఎంఐఎం
By - TV5 Telugu |25 Jan 2020 3:00 PM GMT
భైంసాలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు అల్లర్లతో తారాస్థాయికి చేరిన భైంసాలో ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ బీజేపీ- ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 26 వార్డులకుగాను.. ఎంఐఎం 7, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. అటు ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిపొందారు. దీంతో గెలుపుపై బీజేపీ-ఎంఐఎం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com