చంపేస్తామని వైసీపీ గూండాలు బెదిరిస్తున్నారు : సుంకర పద్మశ్రీ
By - TV5 Telugu |25 Jan 2020 6:03 PM GMT
రాజధానిని కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని మండిపడ్డారు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి .. ఇంటిపై దాడి చేసి చంపేస్తామని వైసీపీ గూండాలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజల తరుపున పోరాడుతున్న మీడియా ప్రతినిధులపైన నిర్భయ లాంటి తప్పుడు కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పద్మశ్రీ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com