గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసిన కాంగ్రెస్‌

గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసిన కాంగ్రెస్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమ కౌన్సిలర్లను రహస్య ప్రదేశాలకు బస్సుల్లో తరలించారు. పురపోరులో చతికలపడి.. గెలిచిన 7 మున్సిపాలిటీలలోనైనా పీఠం పదిలం చేసుకునేందుకు వ్యూహం రచిస్తోంది. తమ అభ్యర్థులు చేజారకుండా ముందస్తుగా జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే తమ సభ్యులను క్యాంపులకు తరలించింది.

రాష్ట్ర చరిత్రలో నాలుగోసారి నల్లగొండ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఒక బూటకమని.. విపక్షాలకు సమయం ఇవ్వకుండా చేసి ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌ పెరిగిందని చెప్పారు. గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు బాధ్యతగా పనిచేయాలని కోమటిరెడ్డి పిలుపు నిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story