గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన మండలి ఛైర్మన్ షరీఫ్
By - TV5 Telugu |26 Jan 2020 5:48 PM GMT
శాసన మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్తో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. రాజ్భవన్ నుంచి వచ్చిన పిలుపుతో శనివారం సాయంత్రం స్పీకర్ తమ్మినేని గవర్నర్తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం మండలి ఛైర్మన్ షరీఫ్ కూడా గవర్నర్ను కలిశారు. సాయంత్రం తేనీటి ఉంది. కానీ ముందుగానే ఇద్దరు సభాపతులతో భిశ్వభూషన్ సమావేశం కావడం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, మండలి రద్దు వార్తలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com