విశాఖలో వివాదాస్పదమవుతోన్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ
By - TV5 Telugu |29 Jan 2020 2:27 PM GMT
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ సర్కార్ విశాఖలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఆరువేల ఎకరాలకు పైగా భూ సేకరణ కోసం ప్రభుత్వ జీవో విడుదల చేయడాన్ని బలహీన వర్గాలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇళ్ల స్థలాల ముసుగులో రియల్టర్లకు లాభం చేకూర్చేందుకు ల్యాండ్ పూలింగ్కి సర్కార్ శ్రీకారం చుట్టిందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన 72జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలంటున్నారు సీపీఎం నేతలు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com