నేడు భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. కోహ్లిని ఊరిస్తున్న రికార్డులు

నేడు భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. కోహ్లిని  ఊరిస్తున్న రికార్డులు

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆక్లాండ్‌లో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించింది. ఇవాళ హామిల్టన్‌లో జరిగే మూడో టీ20ని కూడా గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని తహతహలాడుతుంది కోహ్లీసేన. ఈ మ్యాచ్‌ గెలిస్తే న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న ఘనత దక్కుతుంది.

అటు.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కివీస్‌తో మూడో టీ20లో కోహ్లి 25 పరుగులు చేస్తే ఎంఎస్‌ ధోని రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా ధోని చేసిన పరుగులు ఒక వెయ్యి 112. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్‌ చేయడానికి కోహ్లికి 25 పరుగులు అవసరం. భారత్‌ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోని పేరిట ఉంది. ఇది ఇవాళ్టి మ్యాచ్‌లో బద్ధలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌ లిస్టులో డుప్లెసిస్‌ ఒక వెయ్యి 273 పరుగులు, కేన్‌ విలియమ్సన్‌ ఒక వెయ్యి 148 పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story