మిషన్ భగీరథ, లిక్కర్ స్కాం డబ్బంతా ఎన్నికల్లో ఉపయోగించారు : ఉత్తమ్

మిషన్ భగీరథ, లిక్కర్ స్కాం డబ్బంతా ఎన్నికల్లో ఉపయోగించారు : ఉత్తమ్

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. అధికారులంతా.. ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేశారని ఆరోపించారు. నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి.. ఫలితాల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. అసలు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుండా.. ఏయే మున్సిపాల్టీలు కావాలో కేసీఆర్, కేటీఆర్ ఓ లిస్టు రాసుకుంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బునంతా ఎన్నికల్లో ఉపయోగించారంటూ ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story