ఉగాది నాటికి పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తాం : హరీష్రావు
By - TV5 Telugu |29 Jan 2020 11:18 PM GMT
ఉగాది నాటికి పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు మంత్రి హరీష్రావు. సిద్ధిపేటలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఇంటికీ జూట్ బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. సిద్ధిపేటను ఆరోగ్య సిద్ధిపేటగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ఉగాది పండుగ నాటికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ జరుగుతుందన్నారు. సిద్ధిపేటలో 500 పడకల ఆస్పత్రి, ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com