మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ముమ్మర ఏర్పాట్లు
By - TV5 Telugu |29 Jan 2020 8:21 PM GMT
మేడారం భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను సురక్షితంగా చేరవేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. నాలుగువేల బస్సులతో 23 లక్షలకు పైగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులందరికీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని.. వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని శ్రీధర్ తెలిపారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com