ఘనంగా పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాజస్థాన్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ గెహ్లాట్ హజరయ్యారు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్న దాదాపు 400 మంది విద్యార్ధులు గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ తమిళసై... ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నోరులేని జీవులకు వైద్యం అందిస్తున్నందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు వెళ్లి మరింత విస్తృతంగా సేవలు అందించాలని కోరారు గవర్నర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టిందని, పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com