అమరావతి నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమైన రైతులు

అమరావతి ఉద్యమం హస్తిన తాకనుంది.. ఇప్పటి వరకు అమరావతిలోనే ఆందోళనలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్న రైతులు.. తమ నినాదాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సిద్ధమయ్యారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు ఇప్పటికే అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
దాదాపు 47 రోజులకు పైగా రాజధాని అంశంపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రైతుల పోరాటానికి తగిన న్యాయం చేయాలని కోరుతామన్నారు.
రాజధానిలో ఇప్పటి వరకు 30 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వీలనైంత ఎక్కువ మంది కేంద్రమంత్రులను కలిసి రాజధానిపై స్పష్టమైన హామీ తీసుకున్నాకే ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లామంటున్నారు రైతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com