ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ పాలన : టీడీపీ నాయకురాలు నన్నపనేని

X
By - TV5 Telugu |3 Feb 2020 1:04 AM IST
ఉద్యమమే ఊపిరిగా అమరావతి రైతుల ఆందోళన కోనసాగుతుంది. వెలగపూడిలో రైతుల దీక్ష శిబిరాన్ని టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి సందర్శించి మద్దతు తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు . అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాలన వికేంద్రీకరణ కాదు .. అభివృద్ధి కేంద్రీకరణ జరగాలన్నారు. 47 రోజులుగా రైతులు అందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నన్నపనేని.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com