5 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలి : తెరాస ఎంపీ నామా
By - TV5 Telugu |3 Feb 2020 3:46 PM GMT
తెలంగాణకు రావాల్సిన 5 వేల కోట్ల GST బకాయిలు విడుదల చేయాలని TRS ఎంపీలు నామానాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలు లోక్సభలో డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కేంద్రం నుంచి రావాల్సిన GST బకాయిలు ఆలస్యం కావడంతో పథకాల అమలుకు ఆటంకం కలుగుతోందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com