నిజామాబాద్ కేంద్రంగా మసాలా దినుసుల బోర్డు ఏర్పాటు చేస్తాం: పీయూష్ గోయల్
నిజామాబాద్ కేంద్రంగా మసాలా దినుసులు సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పసుపు పంట ఎగుమతులపైనా ఈ బోర్డు ప్రత్యేక దృష్టి సారించనుంది. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం బోర్డు పనిచేయనుంది. ఢిల్లీ వెళ్లిన నిజామాబాద్ రైతులు ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా మసాలా దినుసుల బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరినదానికంటే ఎక్కువ ప్రయోజనాలే కేంద్రం కల్పించిందని పీయూష్ గోయల్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com