శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో పునర్విచారణ ప్రారంభం

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో పునర్విచారణ ప్రారంభం
X

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో పునర్విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ R భానుమతి, జస్టిస్ L నాగేశ్వరరావు, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ మోహన్. M.శాంతనగౌడర్, జస్టిస్ S అబ్దుల్ నజీర్, జస్టిస్ R సుభా ష్ రెడ్డి,, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ ఉన్నారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునిచ్చిన జస్టిస్ RF నారీమన్, జస్టిస్ DY చంద్రచూడ్‌లు ఈ బెంచ్‌లో సభ్యులు కాదు. అలాగే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన మహిళా జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా కూడా కొత్తగా ఏర్పాటైన బెంచ్‌లో లేరు. మత విశ్వాసాలు, ప్రార్ధనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై న్యాయ సమీక్ష పరిధిని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుంది.

శబరిమలలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతి ఇస్తూ 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏ వయసు మహిళలైనా అయ్యప్ప ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకోవ చ్చని తెలిపింది. ఈ తీర్పుపై హిందూత్వ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తీర్పును పున:సమీక్షించాలని డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో మసీదుల్లోకి ముస్లిం మహిళలకు ప్రవేశంపైనా చర్చ ప్రారంభమైంది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో 64 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఇదిలా ఉంటే, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు, ఎంఐఎం పార్టీలు సంచలన ప్రకటన చేశాయి. మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదని ముస్లిం లా బోర్డు, ఎంఐఎం పార్టీ లు స్పష్టం చేశాయి. మహిళలు మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చని తేల్చి చెప్పాయి. మసీదుల్లోకి మహిళలను నిషేధిస్తూ ఖురాన్ సహా పవిత్ర గ్రంథాల్లో ఎలాంటి సూచనలు లేవని పేర్కొన్నా యి. ఈ మేరకు కోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి.

Tags

Next Story