కేంద్రం పాచిపోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోంది : జీవన్ రెడ్డి
By - TV5 Telugu |5 Feb 2020 3:39 PM GMT
కేంద్రం పసుపు బోర్డు ఇవ్వలేదని.. స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ మాత్రమే ఇచ్చిందన్నారు. PUC చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రీజినల్ ఆఫీస్లు ఇప్పటికే ఆరున్నాయని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్వి నకిలీ మాటలన్నారు. కేంద్రం పాచిపోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోందని విమర్శించారు. మాజీ ఎంపీ కవిత కూడా పసుపు బోర్డు కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు జీవన్ రెడ్డి. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేయాల్సిందంతా చేశారని.. పసుపు బోర్డు కేంద్రం పరిధిలోని అంశమని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com