చిరంజీవితో భేటీ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్
By - TV5 Telugu |4 Feb 2020 8:27 PM GMT
హైదరాబాద్లో సినీ నటులు చిరంజీవి, నాగార్జునతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని చిరంజివి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇందులో చర్చించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై సినీ పెద్దలతో చర్చిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ అయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com