అమెరికా రాజకీయాల్లో సత్తా చాటుతున్న తెలుగు వ్యక్తి

అమెరికా రాజకీయాల్లో సత్తా చాటుతున్న తెలుగు వ్యక్తి

ప్రవాస తెలుగువారు అమెరికాలో ఐటి ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. సామాజిక సేవలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణా వ్యక్తి ఆలూరి బంగారు రెడ్డి.. టెక్సాస్ డిస్ట్రిక్ 22 నుంచి పార్లమెంటేరియన్ గా పోటీచేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీనుంచి బరిలోకి దిగుతున్న ఆయన విరాళాల సేకరణ చేపట్టారు. కృషి, పట్టుదలతో తాను ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో స్థానిక అమెరికన్లు, ఎన్నారైలు పాల్గొని బంగారు రెడ్డికి మద్దతు తెలిపారు. ప్రచారం కోసం విరాళాలు అందించిన తెలుగువారు.. స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న బంగారు రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story