సూర్యాపేట్ జిల్లాలో దారుణం.. ఆస్థి వివాదాల్లో ఇద్దరు మృతి

X
TV5 Telugu6 Feb 2020 1:30 PM GMT
సూర్యా పేట జిల్లా, తాళ్ల ఖమ్మం పహాడ్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో సవతి తల్లి, చెల్లెలు మౌనికను రొకలిబండతో మోది హత్య చేశాడు కొడుకు హరీష్. దీంతో ఘటనా స్థలంలోనే చెల్లి మృతి చెందింది. సవతి తల్లి సూర్యపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గత కొంత కాలంగా ఆస్తి పంపకాల విషయంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story