కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో గ్రానైట్‌ లారీ ఆటో ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. అయితే అతడి మృత దేహాన్ని బటయకు తీసేందుకు పోలీసులు అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది... అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.. చనిపోయిన వారిలో మేక బాబు, మేక నర్సయ్య, గడ్డం అంజయ్య, మేక శేఖర్‌లను గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story