ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న ఆ ఇద్దరు యువకులు
By - TV5 Telugu |10 Feb 2020 7:29 PM GMT
తాము ఇంకా దీక్ష విరమించలేదని స్పష్టం చేశారు అమరావతి యువకులు. శ్రీకర్, రవిచంద్ర అనే ఇద్దరు యువకులు అమరావతి కోసం వెలగపూడిలో 151 గంటల దీక్షకు దిగారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరినీ అరెస్ట్ చేసి గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న శ్రీకర్, రవిచంద్ర.. దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. అయితే వీరి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉండటంతో విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com