సినీరంగ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ

X
By - TV5 Telugu |11 Feb 2020 3:21 AM IST
ఇటీవలి కాలంలో సినీరంగం అభివృద్దిపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తరుచూ సినీప్రముఖులతో భేటీ అవుతున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మరోసారి సినీరంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com