విశాఖలో కేంద్ర వైద్యబృందం సుడిగాలి పర్యటన
By - TV5 Telugu |11 Feb 2020 5:49 PM GMT
కేంద్రం నుంచి వచ్చిన కరోనా వైద్యబృందం విశాఖలో సుడిగాలి పర్యటన చేసింది. రద్దీ ప్రాంతాల్లో పర్యటించి కరోనా పట్ల వైద్యుల ముందస్తు చర్యలు ఏవిధంగా వున్నాయో తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టు, కేజీహెచ్, ఛాతి ఆసుపత్రుల్లో పర్యటించిన వైద్యబృందం.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా.. ముందస్తు చర్యలు సంతృప్తికరంగా వున్నాయని కేంద్ర వైద్యబృందం తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com