కాళేశ్వరంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

కాళేశ్వరంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం కాళేశ్వరంలో పర్యటించనున్నారు. కాళేశ్వరం పై అధికారులతో సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ వరకు కేసిఆర్‌ ఏరియల్‌ సర్వే చేయనున్నారు. మూడో టీఎంసీకు సంబంధించిన పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల పనితీరు, కాళేశ్వరం పురోగతి వంటి పలు అంశాలపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు.

గురువారం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన నేపథ్యంలో ప్రగతి భవన్‌ అధికారులతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నదని.. బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు. వచ్చే వర్షం కాలం నుంచి వరద ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మళ్లించే దిశగా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

మరోవైపు గోదావరిపై నిర్మిస్తున్న తుపాకుల గూడెం బ్యారేజీకి ‘సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు జీవోను జారీ చేయాలని ఇంజనీరింగ్‌ చీఫ్‌ మురళీధర్ రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా వుండటం వల్లే తెలంగాణ అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి తెలంగాణ బీళ్లలో కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్నాయని, పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని గుర్తు చేశారు సీఎం.

Tags

Read MoreRead Less
Next Story